సమాజంలో మానవత్వాన్ని చాటిచెప్పే గొప్ప కార్యాలలో రక్తదానం అత్యంత ముఖ్యమైనది. అలాంటి మహత్తర కార్యానికి నిదర్శనంగా జగిత్యాల జిల్లాలో జరిగిన ఒక సంఘటన ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచింది. జగిత్యాల వాణి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాజ్యలక్ష్మి అనే మహిళకు అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే చింత సుదీర్ స్పందించి రక్తదానం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

తక్షణమే తన తోటి రక్తదాతను సంప్రదించగా, జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో అకౌంటెంట్గా పని చేస్తున్న ఎన్. నరేష్ ముందుకు వచ్చారు. ఎలాంటి ఆలస్యం లేకుండా తన అమూల్యమైన రక్తాన్ని దానం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడటానికి సహాయపడ్డారు. నరేష్ చేసిన ఈ మానవతా సేవతో రాజ్యలక్ష్మి కుటుంబానికి కొత్త ఆశ వెలిగింది.
ఈ సందర్భంగా చింత సుదీర్ తన తరపున, పెషెంట్ కుటుంబ సభ్యుల తరపున, అలాగే వాణి హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తరపున రక్తదాత నరేష్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “ఇలాంటి సమయాల్లో ముందుకు వచ్చి రక్తదానం చేసే వారు నిజమైన హీరోలు” అని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమం అనంతరం చింత సుదీర్ మాట్లాడుతూ, “రక్తదానం మహా ప్రాణదానం. ఇది ఎవరి ప్రాణాన్నైనా కాపాడే శక్తి కలిగి ఉంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు, యువతి రక్తదానానికి ముందుకు రావాలి. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ సంవత్సరానికి కనీసం ఒకసారి అయినా రక్తదానం చేయాలి” అని విజ్ఞప్తి చేశారు.
నరేష్ చేసిన ఈ సేవ మనందరికీ ప్రేరణగా నిలుస్తుంది. రక్తదానం ద్వారా మనం ఒక జీవితం కాదు, ఒక కుటుంబానికే కొత్త జీవనాన్ని అందించగలం. ఇలాంటి మహత్తర కార్యాలు మరెందరో చేయాలని ఆకాంక్షిద్దాం.











Leave a Reply