Navataram

Real news Real time

ముల్కల్లలో ఘోర రోడ్డు ప్రమాదం – ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్ల ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, దండేపల్లి మండలంలోని తనుమడుగు గ్రామానికి చెందిన మలవత్ సాయి కుమార్ కాసిపేటలో జరిగే వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు TG21T0564 నంబరు గల కారులో బయలుదేరాడు. జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న కారు, ముల్కల్ల వద్ద ముందుగా ప్రయాణిస్తున్న TS07UB1599 నంబరు గల లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ లారీ జగిత్యాల జిల్లా వెల్గటూర్ నుంచి మంచిర్యాలకు కంకర లోడ్‌తో వెళ్తున్నట్లు సమాచారం.

లారీని ఢీకొన్న తర్వాత కారు అదుపు తప్పి సమీపంలోని ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి యజమానికి చెందిన స్కూటీ పూర్తిగా ధ్వంసమైంది. అయితే ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాకపోవడం ఉపశమనంగా మారింది.

కారులో సాయి కుమార్‌తో పాటు అతని ఏడు సంవత్సరాల కుమారుడు శివతేజ కూడా ఉన్నాడు. ప్రమాదం సమయంలో కారులోని ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్వల్ప గాయాలతోనే వారు బయటపడినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Recent Post:-

బీజేపీ రామచంద్రరావు ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కార్పొరేటర్లకు సూచన

Homemade Remedy for Cold: Simple and Effective Natural Relief at Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *