తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మరోసారి విరుచుకుపడే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో భారీ వర్షాలు – 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
హన్మకొండ, వరంగల్, మహబూబ్ బాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, నదులు, వాగులు, చెరువుల సమీప ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదే సమయంలో ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
వర్షాల కారణంగా తక్కువ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉండటంతో, జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ శాఖ, రోడ్లు, మునిసిపల్ సంస్థలు, రెవెన్యూ విభాగం సమన్వయంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని అధికారులు తెలిపారు.
రైతులు పంటలను రక్షించుకోవాలని, వాగులు, చెరువుల దాటవద్దని సూచించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వానలు మొదలైపోయాయని, వర్ష తీవ్రత రాత్రి నుంచి పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.











Leave a Reply